Monday, February 7, 2011

హజ్జ్ చరిత్ర






అల్హందులిల్లాహ్ సకల ప్రశంసలు అల్లాహ్ కే.  
సహీహ్ బుఖారీ మరియు సహీహ్ ముస్లిం హదీథ్ గ్రంథాలలో నమోదు చేయబడిన ఇబ్నె ఉమర్ రదియల్లాహు అన్హుమా మరియు ఇతరుల హదీథుల ఆధారంగా అల్లాహ్ పవిత్ర గృహానికి చేసే హజ్జ్ యాత్ర అనేది ఇస్లాం యొక్క ఐదు మూలస్థంభాలలోని (మూలసిద్ధాంతాలలోని) ఒక మూలస్థంభమనే విషయంలో ప్రాచీన-ఆధునిక, పూర్వ-ప్రస్తుత పండితులు ఏకీభవిస్తున్నారనేది ముస్లింలందరికీ తెలుసు. 
ఇతర ఆరాధనలలో మాదిరిగా హజ్జ్ లో కూడా కొన్ని ప్రత్యేకమైన ఆచరణలు  ఉన్నాయి. అల్లాహ్ నిర్దేశించిన విధంగానే వీటిని ఆచరించవలసి ఉంది. ఉదాహరణకు మీఖాత్ నుండి ఇహ్రామ్ స్థితిలోనికి ప్రవేశించటం, తవాఫ్ (కాబా ప్రదక్షిణ), సఫా మరియు మర్వాల మధ్య సయీ చేయటం, అరఫహ్ మైదానంలో నిలబడటం, ముజ్దలిఫహ్ మైదానంలో రాత్రి గడపటం, జమరాత్ లో రాళ్ళు విసరటం, పశుబలి (ఖుర్బానీ) చేయటం మొదలైన ప్రఖ్యాత హజ్జ్ ఆచరణలు. వీటన్నింటినీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధనల ప్రకారమే  ఆచరించవలసి ఉన్నది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క హజ్జ్ యాత్రను వివరించే హదీథులు అనేకం ఉన్నాయి; జాద్ అల్ మాద్ అనే గ్రంథంలో ఇమాం ఇబ్నె అల్ ఖయ్యిమ్ మరియు అల్ బిదాయహ్ వల్ నిహాయహ్  అనే గ్రంథంలో అల్ హాఫిజ్ ఇబ్నె కథీర్ హదీథులను సంకలనం చేసియున్నారు; అంతేకాక హదీథుల నుండి ఉద్భవించే హజ్జ్ నియమనిబంధనలను కూడా ఇద్దరు పండితులు వివరించినారు. నియమనిబంధనలను నేర్చుకోవటంలో మరియు వాటిని ఆచరించటంలో ప్రతి ముస్లిం తప్పకుండా శ్రద్ధ చూపవలెను.
అల్లాహ్ స్మరణాన్ని, ధ్యానాన్ని స్థాపించటమే హజ్జ్ ఆచరణల యొక్క ప్రధాన ఉద్దేశ్యమని మనం గుర్తుంచుకోవలెను. దీని గురించి ఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా తెలుపుతున్నాడు.(ఖుర్ఆన్ వచనాల భావం యొక్క అనువాదం)
(హజ్జ్ కాలంలో) మీ ప్రభువు అనుగ్రహాలను (వ్యాపారం ద్వారా) అన్వేషిస్తే మీపై దోషమేమీ లేదు. అరఫాత్ నుండి తరలిపోయినప్పుడు, మష్అరిల్ హరాం (ముజ్దలిఫా) వద్ద అల్లాహ్ ను స్మరించండి. ఆయన మీకు నేర్పిన విధంగా ఆయనను స్మరించండి. నిశ్చయంగా, పూర్వం మీరు మార్గభ్రష్టులలోని వారిగా ఉండేవారు. తరువాత ప్రజలు ఎక్కడి నుండైతే తరలిపోతారో, అక్కడి నుండి మీరూ తరలిపొండి మరియు అల్లాహ్ యొక్క క్షమాభిక్షను వేడుకోండి. నిశ్చయంగా, అల్లాహ్ అమితంగా క్షమించేవాడూ, అపార కృపాశీలుడు. ఎప్పుడైతే మీరు మీ మనాసిక్లు పూర్తి చేసుకుంటారో, అల్లాహ్ ను స్మరించండి - మీరు మీ పూర్వీకులను స్మరించినట్లుగా లేదా అంతకన్నా అధికంగా స్మరించండి. మరియు ప్రజలలో ఎవరైతే మా ప్రభూ! మాకు లోకంలోనే ప్రసాదించుఅని అంటారో, వారికి పరలోకంలో ఎలాంటి భాగమూ ఉండదు. మరియు వారిలో మరికొందరు మా ప్రభూ! మాకు ఇహలోకంలో మంచిని ప్రసాదించు మరియు పరలోకంలోనూ మంచిని ప్రసాదించు. మరియు మమ్మల్ని నరకాగ్ని శిక్ష నుండి కాపాడు.అని అంటారు. అటువంటి వారికే తాము సంపాదించుకున్న దాని నుండి భాగం ఉంటుంది. మరియు అల్లాహ్ లెక్క తీసుకోవటంలో అతి శీఘ్రమైన వాడు. మరియు లెక్కించ దగిన దినములలో అల్లాహ్ ను స్మరించండి. ఎవరైతే రెండు రోజులలోనే వెళ్ళడానికి త్వరపడతారో, అతనిపై ఎటువంటి దోషమూ లేదు మరియు ఎవరైతే ఆలస్యం చేస్తారో, అతనిపై కూడా ఎటువంటి దోషమూ లేదుఇది భయభక్తులు కలవారి కొరకు. అల్లాహ్ కు భయపడుతూ ఉండండి మరియు తెలుసుకోండి - మీరంతా ఆయన వైపునకే సమీకరించబడతారు.
[అల్ బఖరహ్ 2:198-203]
ఒక హదీథులో ఆయెషా రదియల్లాహు అన్హా ఇలా ఉల్లేఖించినారు: కేవలం అల్లాహ్ స్మరణాన్ని స్థాపించటం కొరకే కాబా గృహం చుట్టూ తవాఫ్ (ప్రదక్షిణం) చేయటం, అస్సఫా మరియు అల్ మర్వాల మధ్య సయీ (తిరగటం), జమరాత్ లో రాళ్ళు విసరటం మొదలైనవి నిర్దేశింపబడినవి.” అల్ బైహఖీ (5/145) దీనిని ముల్లఖ్ హదీథుగా వర్గీకరించినారు మరియు ఇందులో కొంత బలహీనత ఉన్నప్పటికీ, హదీథును మర్ఫూ హదీథుగా ఉల్లేఖించినారు.
హజ్జ్ ఆచరణలను గౌరవించమనే అల్లాహ్ ఆజ్ఞలను ముస్లింలు మనస్పూర్తిగా పాటిస్తారు. దీని గురించి ఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు (ఖుర్ఆన్ వచనపు భావం యొక్క అనువాదం): 
అలాగే నిశ్చయంగా హృదయాలలో ఉన్న దైవభీతి వల్లనే అల్లాహ్ నియమించిన చిహ్నాలను గౌరవిస్తారు.
[అల్ హజ్ 22:32] 
బుఖారీ హదీథు గ్రంథంలోని ఒక హదీథులో ఇలా నమోదు చేయబడినది: ఉమర్ ఇబ్నె ఖత్తాబ్ రదియల్లాహు అన్హు దివ్యశిలను ముద్దాడి, దానితో ఇలా పలికినారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నిన్ను ముద్దాడటాన్ని నేను గనుక చూసి ఉండకపోతే, నేను నిన్ను అస్సలు ముద్దు పెట్టుకునే వాడినే కాను.” 
హజ్జ్ ఆచరణలను చర్చిస్తూ మరియు వివరిస్తూ ఇబ్నె అల్ జౌజీ ఇలా అన్నారు:  
ఆచరణల వెనుకనున్న చరిత్ర కనుమరుగయిపోయినది, కానీ వాటి నియమాలు మాత్రం అలాగే వాడుకలో నిలిచిపోయాయి. ఆచరణలు కొందరు దర్శకులను తికమక పెట్టవచ్చు. దీనికి కారణం వారికి ఆచరణల వెనుకనున్న కారణం తెలియకపోవటమే. అందువలన వారు హజ్జ్ లోని కొన్ని ఆచరణల గురించి దీనిలో అర్థం పర్థం లేదు.’ అని పలుకుతుంటారు. హదీథు ఉల్లేఖనలు లభ్యమైనంత వరకు వాటికి గల కారణాలను నేను వివరించాను. ఇప్పుడు వాటి సరైన అర్థాలను వివరిస్తాను
సమర్ధించుకోదగ్గ మరియు తేలికగా అర్థం చేసుకోదగ్గ సరైన కారణంపైనే ఆరాధనల యొక్క అసలు పునాది ఆధారపడి ఉంటుందనేది ఇక్కడ గమనించవలసిన ముఖ్యవిషయం. అదేమిటంటే, దాసుడు తన యజమానికి సమర్పించుకోవటం మరియు సంపూర్ణ విధేయత చూపటం. ఆతని ప్రార్థనలలో ఇబాదహ్ (ఆరాధన) అనే పదం యొక్క భావాన్ని ప్రదర్శించే వినమ్రత, వినయం మరియు సంపూర్ణ సమర్పణ ఉంటుంది. 
జకాహ్ దానంలో (విధిదానంలో) బీదలపై చూపే దయ మరియు సహాయం ఇమిడి ఉన్నాయి. కాబట్టి దానర్థం తేటతెల్లంగా స్పష్టమవుతున్నది. 
ఉపవాసం అంటే తను దాస్యం చేయవలసిన ఏకైక ఆరాధ్యునికి మాత్రమే విధేయత చూపటానికి వీలుగా తన స్వంత కోరికలను, వాంఛలను, అభిలాషను, ఇచ్ఛను అణచివేసుకోవటం. 
కాబాగృహాన్ని గౌరవించటం, దానిని దర్శించటం మరియు దాని చుట్టుప్రక్కల ప్రాంతాల పవిత్రతను స్థాపించటం మొదలైనవి ఉత్తమ ఆచరణలు. చిత్తశుద్ధితో పరిశుభ్రంగా అక్కడకు చేరటమనేది ఒక దాసుడు సంపూర్ణ వినయవిధేయతలతో, వినమ్రతగా, అణుకువగా, నిరాడంబరంగా, నిగర్వంగా తన ప్రభువు వైపు మరలటాన్ని స్పష్టం చేస్తుంది. తను అర్థం చేసుకున్న మరియు తనను ప్రేరేవించిన ఆరాధనలను మానవుడు సునాయాసంగా ఆచరిస్తాడు. కాని పరిపూర్ణ సమర్పణ సాధించటం కొరకు మనం అర్థం చేసుకోలేని కొన్ని ఆరాధనలు పాటించవలసి ఉంటుంది. వాటి ఆచరణ మానవుడికి అంత సులభతరం కాకపోవచ్చు మరియు వాటిని అతను గ్రహించలేక పోవచ్చు. పరిస్థితిలో అల్లాహ్ ఆజ్ఞలకు విధేయత చూపటమనేది మాత్రమే మనల్ని అటుంవంటి ఆరాధనలు చేయటానికి ప్రేరేపిస్తుంది. ఇది అత్యుత్తమమైన వినమ్రత, అణుకువ మరియు సమర్పణ విధానం.” మరిన్ని వివరాలకు ముథీర్ అల్ అజమ్ అల్ సాకిన్ (1.285-286)’ చూడండి
ఇది అర్థం అయినట్లయితే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కంటే పూర్వపు హజ్ ఆచారాల చరిత్ర గురించి మనకు ఎక్కువగా తెలియదనే విషయంలో అంత ప్రాధాన్యత లేదనేది మనం అర్థం చేసుకోగలం. కొన్ని హజ్ ఆచరణల గురించి వివిధ గ్రంథాలలో తెలుపబడిన కొన్ని ఉల్లేఖనలను క్రింద తెలుపుచున్నాము
1 – హజ్ ఎప్పుడు విధిగా చేయబడినది? హజ్ ఎప్పుడు ఆరంభమైనది
అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు (ఖుర్ఆన్ వచనపు భావం యొక్క అనువాదం): 
మరియు ప్రజలకు హజ్ యాత్రను గురించి ప్రకటించు: వారు పాదాచారులుగా మరియు ప్రతి బలహీనమైన ఒంటె (సవారీ) మీద, విశాల (దూర) ప్రాంతాల నుండి మరియు కనుమల నుండి నీ వైపుకు వస్తారు.
[అల్ హజ్జ్ 22:27] 
ఇబ్నె కథీర్ వచనాన్ని వివరిస్తూ ఇలా తెలిపినారు (3/221): 
దీని అర్థం ఏమిటంటే: “ ‘( ఇబ్రాహీం) ప్రజలకు హజ్జ్ గురించి ప్రకటన చేయి, మేము నిన్ను ఆజ్ఞాపించి నిర్మింపజేసిన గృహం వైపునకు పవిత్ర యాత్ర చేయమని ప్రజలకు పిలుపునివ్వు. అనే అల్లాహ్ ఆదేశం విని, ఇబ్రాహీం అలైహిస్సలాం ఇలా అంటాడు ప్రభు! నా పిలుపు అంత బిగ్గరగా లేదే. మరి అది ప్రజలకు ఎలా చేరగలదు?’ అల్లాహ్ ఇలా పలుకుతాడు ప్రకటించు మరియు మేము దానిని ప్రజలకు చేర్చుతాము.” అప్పుడు ఆయన తన స్థానంలో నిలుచుని లేదా ఒక గుట్టపై నిలుచుని లేదా అస్సఫా అనే చిన్న కొండపై నిలుచుని లేదా కాబాకు అతి దగ్గరలోనున్న అబు ఖుబైస్ అనే ఎతైన పర్వతంపై నిలుచుని గొంతెత్తి ఇలా ప్రకటించినాడు: “ ప్రజలారా, మీ ప్రభువు ఒక గృహాన్ని ఎన్నుకున్నాడు, కాబట్టి దానిని దర్శించటానికై రండి.” అప్పుడు అతని పిలుపును భూమిపై ఉన్న అన్ని ప్రాంతాలకు చేరుకోవటానికి వీలుగా పర్వతాలు క్రిందకు వంగినాయి. పిలుపును సమయంలో భూమిపై ప్రాణంతో ఉన్న మానవులందరూ వినటమే కాక, ఇంకా జన్మించని తల్లి గర్భంలోని శిశువులు మరియు పురుషుని నడుములోని వీర్యబిందువులు కూడా విన్నాయని తెలుపబడినది. అతని పిలుపు విన్న మరియు అల్లాహ్ ఎన్నుకున్న ప్రతి ఒక్కరూ వారు ప్రాంతంలో నివసిస్తున్నా, పట్టణంలో నివసిస్తున్నా, చెట్ల నీడలలో లేదా గుడారాలలో నివసించే దేశదిమ్మరులైనా లబ్బైక్ అల్లాహుమ్మ లబ్బైక్ (హాజరయ్యాను, అల్లాహ్, హాజరయ్యాను) అని పలుకుతూ ప్రళయదినం వరకు తప్పక హజ్ యాత్ర చేయవలెను. ఇబ్నె అబ్బాస్, ముజాహిద్, ఇక్రిమాహ్, సయీద్ ఇబ్నె జుబైర్ మరియు ఇతర ముందుతరం పండిత ముస్లిం ఉల్లేఖనల యొక్క సారాంశమిదిమరియు అసలు విషయం అల్లాహ్ కే తెలుసు. 
ఇబ్నె అల్ జౌజీ తన పుస్తకం ముథీర్ అల్ అజమ్ అల్ సాకిన్ (1/354)లో పైన తెలిపిన విషయాలనే చాలా క్లుప్తంగా ఉల్లేఖించి, వాటిని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చరిత్ర (సీరత్) తెలిపిన ఉల్లేఖకులవిగా నమోదు చేసినారు.  
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ను భూమిపై పంపక ముందు హజ్ విధిగావించటం గురించిన చరిత్రకు సంబంధించిన విషయమిది. అయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో హజ్ విధిగావింపబడిన సంవత్సరం గురించి పండితులలో విభిన్న అభిప్రాయాలు ఉన్నాయి. కొందరు పండితులు 6 హిజ్రీ సంవత్సరంలో అని, కొందరు, 7 హిజ్రీ సంవత్సరంలో అని, కొందరు 9 హిజ్రీ సంవత్సరంలో అని, మరికొందరు 10 హిజ్రీ సంవత్సరంలో అని అంటారు. అయితే ఖచ్చితంగా 9 లేదా 10 సంవత్సరంలో హజ్ విధిగావింపబడినది అని ఇమాం ఇబ్నె అల్ ఖయ్యిమ్ అభిప్రాయపడుతున్నారు. తన జాద్ అల్ మఆద్ అనే పుస్తకంలో ఆయన ఇలా తెలిపినారు:  
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మదీనాకు వలస వెళ్ళిన తరువాత, వీడుకోలు హజ్ గా ప్రఖ్యాతి చెందిన హజ్ తప్ప ఇంకే హజ్ యాత్రా చేయలేదు మరియు అది 10 హిజ్రీ సంవత్సరంలో జరిగినది అనే విషయంలో పండితుల మధ్య ఎలాంటి భేదాభిప్రాయం లేదు. హజ్ ఆదేశం అవతరించిన తరువాత, ఎలాంటి ఆలస్యం చేయకుండా హజ్ చేయటానికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం త్వరపడినారు. అయితే హజ్ ఆదేశం ఆయన చివరి దశలో అంటే 9 లేదా 10 హిజ్రీ సంవత్సరంలో అవతరించినది. మరి అటువంటప్పుడు, ఆదేశం ముందుగానే అవతరించినా, దాని ఆచరణ మాత్రం 9 లేదా 10 హిజ్రీ సంవత్సరం వరకు వాయిదా వేయబడినదని ఎవరైనా ఎలా నిరూపించగలరు? ఖుర్ఆన్ లోని మూడవ అధ్యాయమైన సూరహ్ ఆలె ఇమ్రాన్ యొక్క మొదటి భాగం రాయబార బృందాల (ఆమ్ అల్ ఉఫూద్) సంవత్సరంలో అవతరించినదని తెలుపుతున్నాము. సంవత్సరంలో నజరాన్ ప్రాంతం నుండి ఒక రాయబార బృందం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చినది. వారు జిజియా పన్ను చెల్లించేవిధంగా ఆయన వారితో ఒడంబడిక చేసుకున్నారు మరియు జిజియా పన్ను గురించిన ఆదేశాలు తబూక్ యుద్ధం జరిగిన 9 హిజ్రీసంవత్సరంలో సూరహ్ ఆలె ఇమ్రాన్ మొదటి భాగం అవతరించినప్పుడు అవతరించినవి. …” 
జాద్ అల్ మఆద్ (3/595)లో ఇలా తెలుపబడినది - ఖుర్ఆన్ లో (3:97) సూరహ్ ఆలె ఇమ్రాన్ లోని 97 వచనంలో హజ్ విధిగావించపబడిన ఆదేశం ఇలా ఉన్నది (ఖుర్ఆన్ వచన భావానికి అనువాదం: మరియు అక్కడికి పోవటానికి, శక్తిగల వారికి గృహయాత్ర అల్లాహ్ కొరకు చేయటం విధిగావింపబడినది. హజ్ యాత్ర విధిగావించబడినదనే ఆజ్ఞను వచనం తెలుపుతున్నది. ఇది 9 సంవత్సరం చివరి భాగంలో రాయబార బృందాల సంవత్సరంలో అవతరించినది. కాబట్టి హిజ్రీ 9 సంవత్సరం చివరిలో హజ్ యాత్ర విధిగావించబడినది.
తన తఫ్సీర్ లో (ఖుర్ఆన్ వివరణ గ్రంథం, 2/4/92 భాగంలో) అల్ ఖుర్తుబి ఇలా తెలిపినారు: హజ్ గురించి అరబ్ ప్రజలకు ముందునుండీ తెలుసు. ఇస్లాం వచ్చిన తరువాత, వారికి ముందునుండీ తెలిసియున్న ప్రజలపై హజ్ విధిగావించబడినదే అనే విషయమే మరల వారికి తెలుపబడినది.మరిన్ని వివరాలకు ఇబ్నె అల్ ఖుర్తుబి రచించిన అల్ అహ్కామ్ అల్ ఖుర్ఆన్, 1/286 చదవండి.
2 – కాబాగృహం చుట్టూ తవాఫ్ (ఏడు సార్లు ప్రదక్షిణ) చేయటం
అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు (ఖుర్ఆన్ వచనపు భావానికి అనువాదం): 
ఇబ్రాహీము మరియు ఇస్మాయీలులను ఇలా ఆదేశించాము నా గృహాన్ని పరిశుద్ధ పరచండిదాని ప్రదక్షిణలు చేసేవారి కొరకు, ఏతేకాఫ్ పాటించేవారి కొరకు (ప్రార్థనలు మరియు ఆరాధనల నిమిత్తం తమను తాము ఏకాంత పరచుకునేవారి కొరకు), ఇంకా రుకూ - సజ్దాలు చేసేవారి కొరకు.
[అల్ బఖరహ్  2:125] 
కాబాగృహం చుట్టూ చేసే తవాఫ్ - ప్రవక్త ఇబ్రాహీమ్ అలైహిస్సలాం కాలంలో తెలిసిన విషయమేనని వచనం సూచిస్తున్నది. 
3 – రమల్  
రమల్ అంటే దగ్గర దగ్గరగా అడుగులు వేస్తూ, త్వరత్వరగా, వడివడిగా నడిచే నడక. తవాఫ్ అల్ ఖుదూమ్ (ఆగమ తవాఫ్ - మక్కా చేరగానే ప్రారంభంలో చేసేది) లో  ఇది పురుషుల కొరకు సున్నత్ (ఉత్తమం), కానీ స్త్రీలకు కాదు. 
రమల్ ఎలా ప్రారంభమైనది
బుఖారీ హదీథ్ గ్రంథంలో (2/469-470, 1602) మరియు ముస్లిం హదీథ్  గ్రంథంలో (2/991-992, 1262) ఇబ్నె ఉమర్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖించిన హదీథులు ఇలా నమోదు చేయబడినాయి: ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన సహచరులతో రాగా, యత్రిబ్ (మదీనా నగరం) జ్వరంతో బలహీనపడి పోయిన ప్రజలు వచ్చారు చూడండి. అని ముష్రికులు (కాబా వద్దనున్న బహుదైవారాధకులు) అన్నారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తవాఫ్ లోని మొదటి మూడు ప్రదక్షిణలలో వడివడిగా నడవమని (రమల్ చేయమని) ఆదేశించినారు.ఇంకో ఉల్లేఖనలో ఆయన ఇలా ఆదేశించారని నమోదు చేయబడినది, “మీ బలాన్ని ముష్రికులు చూసే (తెలుసుకునే) విధంగా వడివడిగా నడవండి. 
4 – జమ్ జమ్ పవిత్ర జలం మరియు అస్సఫా మరియు అల్ మర్వాల మధ్య చేసే సయీ నడక
ఇబ్నె అబ్బాస్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖించిన హదీథు సహీహ్ బుఖారీలో ఇలా నమోదు చేయబడినది:  
కాబా మస్జిద్ వద్ద నేటి జమ్ జమ్ బావి సమీపంలోని ఎత్తైన ప్రాంతంలో ఉన్న ఒక చెట్టు క్రింద ఇబ్రాహీమ్ అలైహిస్సలాం తన భార్య హాజరాను మరియు ఆవిడ కుమారుడు ఇస్మాయీలును తీసుకు వచ్చినాడు. అప్పుడు ఇస్మాయీలు ఇంకా తల్లి పాలుత్రాగే పసికందు వయస్సులో ఉన్నాడు. రోజులలో మక్కాలో నివసించేవారు కాదు మరియు అక్కడ నీరు కూడా లేకుండెను. ఒక తోలు సంచిలో కొన్ని ఖర్జురపు పళ్ళు మరియు ఒక తోలు సంచిలో కొంత నీరు వారికిచ్చి, అక్కడ వారిని వదిలి పెట్టి, ఆయన తిరుగు ప్రయాణం మొదలుపెట్టినాడు. ఇస్మాయీలు తల్లి ఆయన వెంటబడి, ఇలా పలికినిది, “ ఇబ్రాహీమ్! మానవుడూ, వస్తువూ లేని లోయలో మమ్మల్ని వదిలి, నీవెక్కడికి వెళ్ళుతున్నావు?” ఇలా ఆవిడ అనేక సార్లు ఆయనను ప్రశ్నించినది. కానీ, ఆయన ఆవిడ వైపు అస్సలు చూడ లేదు. ఇక చివరగా ఆవిడ ప్రవక్త ఇబ్రాహీమ్ అలైహిస్సలామును ఇలా ప్రశ్నించినది, “ఇలా చేయమని అల్లాహ్ నిన్ను ఆజ్ఞాపించినాడా?” దానికి ఆయన, “అవును.” అని జవాబిచ్చినాడు. అప్పుడు ఆవిడ, “అలా అయితే, అల్లాహ్ మమ్మల్ని (కాపాడకుండా) వదిలివేయడు,” అని పలికి, వెనుదిరిగినది. ప్రవక్త ఇబ్రాహీమ్ అలైహిస్సలాం ముందుకు ప్రయాణం సాగించినాడు. వారు కనిపించనంత దూరంలో ఉన్న అల్ థానియహ్ అనే ప్రాంతానికి చేరుకున్న తరువాత ఆయన కాబా వైపునకు తిరిగి, రెండు చేతులెత్తి, దీనంగా అల్లాహ్ తో ఇలా వేడుకున్నాడు:  
మా ప్రభూ! వాస్తవానికి నేను నా సంతానంలో కొందరిని నీ పవిత్ర కాబా గృహం దగ్గర పైరు పండని, ఎండిపోయిన కొండలోయలో నివసింపజేశాను. మా ప్రభూ! వారిని అక్కడ నమాజ్ స్థాపించటానికి ఉంచాను. కనుక నీవు ప్రజల హృదయాలను, వారి వైపుకు ఆకర్షింపజేయి మరియు వారు కృతజ్ఞులై ఉండటానికి వారికి జీవనోపాధిగా ఫలాలను సమకూర్చుము..
[ఇబ్రాహీమ్ 14:37] 
ఇస్మాయిలు తల్లి ఇస్మాయిలుకు పాలుపడుతూ, తానేమో తన వద్ద నున్న నీరు త్రాగుతూ ఉండినది. కొన్నాళ్ళలోనే తోలుసంచిలోని నీరు మొత్తం ఖర్చయి పోయినవి. అప్పుడు ఆవిడకు మరియు ఆవిడ బిడ్డకూ దాహం వేయగా, ఆవిడ తన బిడ్డ వైపు దీనంగా చూడసాగినది. ఇక బిడ్డ పరిస్థితి చూడలేక, అతడిని అక్కడే నేలపై పడుకోబెట్టి, దగ్గరలోని అస్సఫా కొండ పైకి ఎక్కి, ఎవరైనా కనబడతారేమోనని లోయ వైపునకు చూడసాగినది. కానీ, ఆవిడకు ఎవరూ కనబడలేదు. అప్పుడు అస్సఫా కొండ దిగి, లోయలోనికి వచ్చి, ఆపదలో మరియు కష్టంలో ఉన్న వ్యక్తి వలే పరుగెత్తుతూ, లోయ దాటి, అల్ మర్వా కొండ పైకెక్కి, నలుదిక్కులా ఎవరైనా కనబడతారేమోనని చూడసాగింది. కానీ ఆవిడకు అక్కడ కూడా ఎవరూ కనబడలేదు. అలా ఆవిడ ఏడు సార్లు తిరిగినది (అస్సఫా మరియు అల్ మర్వా కొండల మధ్య ఏడు సార్లు పరుగెత్తినది). 
ఇబ్నె అబ్బాస్ రదియల్లాహు అన్హుమా ఇలా అన్నారు: ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపినారు, “ఇదియే వాటి మధ్య (అస్సఫా మరియు అల్ మర్వా కొండల మధ్య) ప్రజల సయీ (నడకకు ఆరంభం).” ఆవిడ చివరిసారిగా (ఏడవ సారి) అల్ మర్వా పైకి చేరగానే, ఒక దివ్యవాణి విన్నది. తనకు తానే ష్..ష్!”  అనుకుంటూ, ఏకాగ్రతతో దానిని ఆలకించటానికి ప్రయత్నించినది. ఆవిడకు మరల శబ్దం వినబడగానే, శబ్దం వచ్చిన దిశ వైపునకు తిరిగి ఆవిడ ఇలా అన్నది, “, (నీవెవిరి అయినా గానీ)! నీవు నీ శబ్దాన్ని నాకు వినిపించావు; నాకు సహాయం చేసేదేమైనా నీ వద్ద ఉన్నదా?” అప్పుడు ఒక దైవదూత జమ్ జమ్ స్థలంలో నీటిధార ఉబికి వచ్చే వరకు తన మడమతో (లేదా తన రెక్కతో) త్రవ్వటాన్ని ఆవిడ చూసినది. వెంటనే ఆవిడ నీటి ధార చుట్టూ తన చేతులతో అడ్డుకట్ట కట్టి, తోలుసంచిని నింపుకోవటం మొదలు పెట్టినది. ఆవిడ కొంత నీటిని నిపుకున్న తరువాత, ధార ఇంకా ముందుకు ప్రవహించసాగినది.
ఇబ్నె అబ్బాస్ ఇలా అన్నారు: ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారు, ఇస్మాయీలు తల్లిపై అల్లాహ్ అనుగ్రహం చూపుగాక! ఒకవేళ ఆవడ జమ్ జమ్ నీటి ధారను ఆపటానికి ప్రయత్నించకుండా అలాగే వదిలివేసినట్లయితే ( నీటిని తన తోలుసంచిలో నింపుకోనట్లయితే) , అది భూమి ఉపరితలంపై ఒక నది వలే ప్రవహించి ఉండేది.ఆయన మరల ఇలా పలికారు: “ దైవదూత ఆవిడతో ఇలా అన్నాడు, ‘నిర్లక్ష్యంగా వదిలివేయబడతానేమోనని భయపడకు. ఎందుకంటే బాలుడు మరియు అతడి తండ్రిచే నిర్మింపబడే అల్లాహ్ యొక్క గృహం ఇది. మరియు అల్లాహ్ తన ప్రజలను ఎన్నడూ నిర్లక్ష్యం చెయ్యడు’…” 
ఇబ్నె అల్ జౌజీ తన పుస్తకం అల్ అజమ్ అల్ సాకిన్ (2/47)లో ఇలా తెలిపినారు: “ఇది ఎందుకు జమ్ జమ్ అని పిలవబడుతున్నదనే కారణాన్ని హదీథు వివరిస్తున్నది. ఎందుకంటే నీటిధార ప్రవహించటం మొదలు పెట్టగానే, హాజర్ దానిని నియంత్రించడానికి (అరబీలో జమ్మత్-గా) ప్రయత్నించినది. భాషాపండితుడైన ఇబ్నె ఫారిస్ ఇలా తెలిపినారు: జమమ్తు అల్ నాఖహ్ (నేను ఒంటెకు కళ్ళెం, పగ్గం వేశాను) అనే పదాల నుండి జమ్ జమ్ వచ్చును. 
5 – అరఫహ్ మైదానంలో నిలబడటం
యజీద్ ఇబ్నె షైబాన్ ఉల్లేఖనను అబూ దావూద్ మరియు అత్తిర్మిథీ హదీథు గ్రంథాలు ఇలా నమోదు చేసాయి: అరఫహ్ మైదానంలోని మౌఖిఫ్ (ఎక్కడైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నిలబడిన చోటు) అనే స్థలానికి దూరంగా మేము నిలబడి ఉండగా, ఇబ్నె మిర్బా అల్ అన్సారీ మా వద్దకు వచ్చి, ఇలా పలికినారు, “నేను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క వార్తాహరుడిని. ఆయన మీకు ఇలా తెలుపమన్నారు: ‘మీరున్న చోటునే నిలబడండి. (ఇది కూడా నిలబడే స్థలమే), ఇక్కడనే మీ పితామహుడైన ఇబ్రాహీమ్ నిలబడినారు.’” తన సహీహ్ అబి దావూద్ లో అల్ బానీ దీనిని సహీహ్ హదీథుగా వర్గీకరించినారు. 
హజ్ యొక్క అనేక ఆచరణలు ప్రవక్త ఇబ్రాహీమ్ అలైహిస్సలాం కాలంలో బోధించబడినవే. కానీ, మక్కా ముష్రికులు (బహుదైవారాధకులు) నిర్దేశింపబడని కొన్ని నూతన కల్పితాచారాలను హజ్ యాత్రకు జతపరచినారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్తగా పంపబడిన తరువాత, ఆయన వాటిని ఖండించి, అల్లాహ్ నిర్దేశించిన హజ్ ఆచరణలను వాటి అసలు రూపంలో మరల బోధించినారు. 


taken from islamhouse.com

No comments:

Post a Comment